© 2026 nimisham.in

Nayanthara may have requested fans not to call her the “Lady Superstar,” but the tag has long become an expression of their… The post Nayanthara’s 2026: From Blockbuster Start to a String of Setbacks first appeared on Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT.

చిరంజీవి రీ-ఎంట్రీ తర్వాత సక్సెస్ అందుకున్న మూడు సినిమాలూ సంక్రాంతి సీజన్ లోనే రావడం విశేషం. ఇప్పుడు బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా సైతం సంక్రాంతికే వస్తుండటంతో చిరు డబుల్ హ్యాట్రిక్ కు ఈ సినిమాతో శ్రీకారం చుడతారని మెగాభిమానులు భావిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సెకండ్ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇటీవలే 40 రోజుల షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనం ముందుకు రాబోతోంది. విశేషం ఏమంటే... ఈ సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇచ్చిన తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత పొంగల్ బరిలో హ్యాట్రిక్ సాధించిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. చిరు - బాబి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఆయన సెకండ్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టడం ఖాయమని మెగాభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి కొన్నేళ్ళ గ్యాప్ తర్వాత 2017లో 'ఖైదీ నెం. 150' తో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. చిరంజీవి సినిమా ఎన్నేళ్ళ తర్వాత వచ్చినా అభిమానులు అక్కున చేర్చుకోవడం ఖాయమని ఆ సినిమాతో నిరూపితమైంది. అయితే ఆ తర్వాత 2019లో వచ్చిన 'సైరా నరసింహారెడ్డి' విమర్శకుల ప్రశంసలు అందుకున్నా... సాధారణ ప్రేక్షకుడిని మెప్పించలేకపోయింది. ఆపైన 2022లో వచ్చిన 'ఆచార్య, గాడ్ ఫాదర్' చిత్రాలు సైతం కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. ఇక 2013లో బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' ఆ యేడాది సంక్రాంతి బరిలో నిలిచి విజేతగా జయకేతనం ఎగరేసింది. విశేషం ఏమంటే... రీ-ఎంట్రీ తర్వాత చిరంజీవి రెండో విజయం కూడా సంక్రాంతికే లభించింది. ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగు సీనియర్ హీరోల చిత్రాలలో

నాలుగు ప్రముఖ నిర్మాణ సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం లేఖలు పంపింది. తమ చిత్రాల టిక్కెట్ రేట్ల పెంపు ద్వారా వచ్చిన మొత్తంలో 20 శాతాన్ని వెంటనే ఎఫ్.డి.సి.లో జమ చేయమని కోరింది. తెలుగు సినిమాల టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల పచ్చ జెండా ఊపింది. అయితే అందుకు ఓ షరతును విధించింది. నిర్మాతలు ఎవరైనా సినిమా టిక్కెట్ రేట్లను పెంచుకోవాలని అనుకుంటే, పెంచిన టిక్కెట్ ఛార్జీలలోని లాభంలో ఇరవై శాతాన్ని సినీ కార్మికుల సంక్షేమానికి వెచ్చించడానికై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో జమ చేయాలని చెప్పింది. అందుకు కొందరు నిర్మాతలు ఆమోదం తెలిపి, తమ చిత్రాల టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి సిద్థపడ్డారు. అలా గత యేడాది డిసెంబర్లో వచ్చిన బాలకృష్ణ 'అఖండ 2' సినిమాతో పాటు ఈ సంక్రాంతికి వచ్చిన చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారూ', ప్రభాస్ 'ది రాజా సాబ్' చిత్రాలు ఉన్నాయి. అలానే ఇటీవల విడుదలైన 'పెద్ది' సినిమా సైతం టిక్కెట్ రేట్లను పెంచుకునే వెసులు బాటును ఉపయోగించుకుంది. కానీ ఈ నలుగురు నిర్మాతలు ఇంతవరకూ టిక్కెట్ రేట్ల పెంపు కారణంగా వచ్చిన లాభంలో ఇరవై శాతాన్ని ఎఫ్.డి.సి.లో నమోదు చేయలేదు. దాంతో తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించాలని కోరుతూ ఈ నాలుగు సినిమాల నిర్మాణ సంస్థలకు లేఖ రాసింది. ఎగ్జిబిటర్స్ నుంచి డబ్బులు వసూలు చేసి, ఎఫ్.డి.సి.లో జమ చేయాల్సిన బాధ్యత సదరు నిర్మాణ సంస్థలదే అని స్పష్టం చేసింది. ఆ రకంగా 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, షైన్ స్క్రీన్ ఇండియా, వృద్ధి సినిమాలకు లేఖను పంపింది. మరి వీరు ఎప్పటిలోగా ఆ డబ్బుల్ని జమ చేస్తారో చూడాలి

మెగా ఫ్యామిలీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో మంచి జోష్లో ఉంది. ఈ కుటుంబానికి చెందిన పలువురు హీరోలు వరుసగా భారీ విజయాలను అందుకోవడంతో అభిమానుల్లో సంబరాలు నెలకొన్నాయి. ముఖ్యంగా రామ్చరణ్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, వరుణ్ తేజ్ తమ తాజా చిత్రాలతో సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు ఈ విజయాల పరంపరలో మిగిలిన మెగా హీరోగా సాయి దుర్గ తేజ్ నిలిచారు. ఆయన తదుపరి చిత్రం సంబరాల ఏటిగట్టు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముందుగా పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొత్త బెంచ్మార్క్ను నమోదు చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్కు మరో ఘన విజయాన్ని అందించింది. దీంతో మెగా ఫ్యామిలీ విజయాల పరంపరకు ఓజీ బలమైన ఊపునిచ్చింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా చిరంజీవి కెరీర్లోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో మెగా ఫ్యామిలీ అభిమానుల సంబరాలు మరింత పెరిగాయి. మరోవైపు రామ్చరణ్ నటించిన పెద్ది కూడా భారీ విజయాన్ని అందుకుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించి రామ్చరణ్కు మరో ఘన విజయాన్ని అందించింది. ఇదే జోరులో వరుణ్ తేజ్ కూడా కొరియన్ కనకరాజుతో తిరిగి విజయపథంలోకి వచ్చారు. వరుస పరాజయాల తర్వాత వచ్చిన ఈ సినిమా వరుణ్ తేజ్కు ఎంతో అవసరమైన విజయాన్ని అందించింది. విడుదలైన తొలి రోజుల్లోనే మంచి వసూళ్లను నమోదు చేసి బలమైన ఆరంభాన్ని అందుకుంది. దీంతో మెగా కుటుంబానికి చెందిన ప్రధాన హీరోలందరూ వరుసగా విజయాలను అందుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ విజయాల జాబితాలో సాయి దుర్గ