© 2026 nimisham.in


నాలుగు ప్రముఖ నిర్మాణ సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం లేఖలు పంపింది. తమ చిత్రాల టిక్కెట్ రేట్ల పెంపు ద్వారా వచ్చిన మొత్తంలో 20 శాతాన్ని వెంటనే ఎఫ్.డి.సి.లో జమ చేయమని కోరింది. తెలుగు సినిమాల టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల పచ్చ జెండా ఊపింది. అయితే అందుకు ఓ షరతును విధించింది. నిర్మాతలు ఎవరైనా సినిమా టిక్కెట్ రేట్లను పెంచుకోవాలని అనుకుంటే, పెంచిన టిక్కెట్ ఛార్జీలలోని లాభంలో ఇరవై శాతాన్ని సినీ కార్మికుల సంక్షేమానికి వెచ్చించడానికై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో జమ చేయాలని చెప్పింది. అందుకు కొందరు నిర్మాతలు ఆమోదం తెలిపి, తమ చిత్రాల టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి సిద్థపడ్డారు. అలా గత యేడాది డిసెంబర్లో వచ్చిన బాలకృష్ణ 'అఖండ 2' సినిమాతో పాటు ఈ సంక్రాంతికి వచ్చిన చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారూ', ప్రభాస్ 'ది రాజా సాబ్' చిత్రాలు ఉన్నాయి. అలానే ఇటీవల విడుదలైన 'పెద్ది' సినిమా సైతం టిక్కెట్ రేట్లను పెంచుకునే వెసులు బాటును ఉపయోగించుకుంది. కానీ ఈ నలుగురు నిర్మాతలు ఇంతవరకూ టిక్కెట్ రేట్ల పెంపు కారణంగా వచ్చిన లాభంలో ఇరవై శాతాన్ని ఎఫ్.డి.సి.లో నమోదు చేయలేదు. దాంతో తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించాలని కోరుతూ ఈ నాలుగు సినిమాల నిర్మాణ సంస్థలకు లేఖ రాసింది. ఎగ్జిబిటర్స్ నుంచి డబ్బులు వసూలు చేసి, ఎఫ్.డి.సి.లో జమ చేయాల్సిన బాధ్యత సదరు నిర్మాణ సంస్థలదే అని స్పష్టం చేసింది. ఆ రకంగా 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, షైన్ స్క్రీన్ ఇండియా, వృద్ధి సినిమాలకు లేఖను పంపింది. మరి వీరు ఎప్పటిలోగా ఆ డబ్బుల్ని జమ చేస్తారో చూడాలి
ఆదివారం అంటే అందరికీ పండుగే. అందరూ ఇంట్లో కూర్చుని టీవీలకు అతుక్కుపోతారు. ఇక సండే ఫండే అయ్యేలా ప్రతీ చానెల్లో అరడజనుకు పైగా సినిమాల్ని ప్రసారం చేస్తుంటాయి. ఎంటర్టైన్మెంట్ షోలతో పాటుగా కంటిన్యూ సినిమాల్ని కూడా అందిస్తుంటారు. ఈ క్రమంలో ఈ ఆదివారం నాడు ఏ ఏ ఛానెల్లో ఏ సినిమా ఏ టైంకి వస్తుందో తెలుసుకుందాం.డీడీ యాదగిరి చానెల్లో మధ్యాహ్నం రెండు గంటలకు ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం, ఈటీవీలో 12 గంటలకు శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి మళ్లీ రాత్రి పదిన్నరకు ఇదే సినిమా రిపీట్ మోడ్లో రానుంది. ఈటీవీ ప్లస్లో అయితే ఉదయం 9 గంటలకు దొంగ రాముడు అండ్ పార్టీ, 12 గంటలకు శత్రువు, సాయంత్రం ఆరున్నరకి యమగోల, రాత్రి పదిన్నరకి మంగమ్మ గారి మనవడు రానున్నాయి. ఈటీవీ సినిమాలో ఉదయం 7 గంటలకు ఊహా, 10 గంటలకు వయ్యారి భామలు వగలమారి అత్తలు, ఒంటి గంటలకు ఆయనకి ఇద్దరు, నాలుగు గంటలకు అలీబాబా అరడజను దొంగలు, 7 గంటలకు 90స్ బయోపిక్, పది గంటలకు ఆత్మబలం, అర్దరాత్రి ఒంటి గంటలకు మళ్లీ ఊహ ప్రసారం కానుంది.జెమినీ టీవీలో ఉదయం ఆరు గంటలకే మస్కా, 9 గంటలకు ఊపిరి, 12 గంటలకు గోవిందుడు అందరివాడేలే, మూడున్నరకి బిచ్చగాడు, ఆరు గంటలకు బిచ్చగాడు, తొమ్మిదన్నరకి 7జీ బృందావన కాలనీ రానున్నాయి. జెమినీ లైఫ్లో ఉదయం 11 గంటలకు ఒంటరి పోరాటం, నాలుగున్నరకి డింగ్ డాంగ్ బెల్, జెమినీ మూవీస్లో ఉదయం ఒకటిన్నరకి నీకు నాకు డ్యాష్ డ్యాష్, ఉదయం నాలుగున్నరకి జూనియర్, 7 గంటలకు ఓయ్, 10 గంటలకు బీస్ట్, ఒంటి గంటకు సాహస వీరుడు సాగరకన్య, నాలుగు గంటలకు మహావీరుడు, 7 గంటలకు బొబ్బిలి సింహం, 10 గంటలకు బ్రోకర్ ప్రసారం కానున్నాయి.జీ తెలుగులో ఉదయం 9 గంటలకు హే బల్వంత్, 12 గంటలకు మా అన్నయ్య, సాయంత్రం